ఎన్టీఆర్ షో హిట్టు… మార్పులు చేస్తే ఇంకా బెస్ట్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో హోస్టు గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత సీజన్లో కూడా చేసేందుకు అవకాశం వచ్చిన కొన్ని కారణాల చేత వాటిని వదులుకున్నాడు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం ఎవర మీలో కోటీశ్వరుడు షో కి ఈయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నిన్న రాత్రి ఈ షో ప్రారంభం కాగా ఈ షో కి గెస్ట్ గా రామ్ చరణ్ రావడం జరిగింది.

మొదటి షో తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న.. ఎన్టీఆర్ తన అభిమానులు ఆ సమయాన్ని ఇంకా కొంచెం పెంచితే బెటరని కోరుకుంటున్నారు. ఇక ఇందులో కేవలం యాడ్ లతో కలిపి గంటసేపు మాత్రమే ప్రసారం అవుతూ ఉంటే అందుకు ఎన్టీఆర్ అభిమానులను నిరాశ చెందుతున్నారు. యాడ్స్ లేకుండా ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుందని వారి అభిప్రాయం.

అదేవిధంగా మరికొంతమంది నెటిజెన్స్..8:30 నుంచి 10 గంటల వరకు షో ప్రసారం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.అయితే మరి ఈ విషయంపై ఆ సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక అంతే కాకుండా ఈ షోకు రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్ రావడం గమనార్హం. సెప్టెంబర్ 2వ తేదీన ఇందుకు గల సంబంధించి టిఆర్పి రేటింగ్ ను విడుదల చేస్తున్నారు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తుంది.

ఈ షో సోమవారం నుండి గురువారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. ఈ షోకి ఇంకా ఎంత మంది సెలబ్రెటీలు వస్తారు అని వేచి చూడాల్సిందే.