ఎన్టీఆరే దిక్కు అంటోన్న జనం.. అసలు సంగతి ఏమిటంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లు చూస్తూ అర్థం అవుతోంది. అయితే తారక్‌కు సంబంధించిన ఓ విషయంలో ఆయన మత్రమే దిక్కూ అంటూ జనం వేడుకుంటున్నారు. ఇంతకీ జనానికి తారక్ మాత్రమే దిక్కు అయ్యే పరిస్థితి ఏమిటో అని మీరు అనుకుంటున్నారా.

ఇదంతా కేవలం ప్రమోషన్ స్టంట్ అని చెప్పాలి. తారక్ త్వరలో హోస్ట్ చేయబోతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ గేమ్ షో కోసం బుల్లితెర ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసి చాలా రోజులైనా కూడా ఇంకా ఇది మొదలుకాలేదు. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ అనుకుంటున్నారు. కాగా ఈ షోపై ప్రజల్లో హైప్ తగ్గిపోతుందని గ్రహించిన షో నిర్వాహకులు ఇప్పుడు ఈ షోకు సంబంధించి పలు ప్రోమోలను రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనం అంతా కూడా ‘‘అయ్యా నువ్వే దిక్కు.. మమ్మల్ని కాపాడాలంటే నువ్వు రావాలి.. బతికి బట్టకట్టాలి అంటే నువ్వు బరిలోకి దిగాలి..’’ అంటూ జనం అంతా వేడుకునే ప్రోమోను రెడీ చేస్తున్నారు.

ఇంతలా ఓవర్‌గా ఓ షో కోసం ప్రోమోను చేయడం అవసరమా అని పలువురు కామెంట్ చేస్తున్నా, ప్రస్తుతానికి ఈ షోపై హైప్ మరింత పెంచాలంటే ఈమాత్రం అవసరమే అంటున్నారు నిర్వాహకులు. ఇక ఈ షోను అతి త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. మరి ఈ ప్రోమో రిలీజ్ తరువాత పబ్లిక్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.