టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే నేడు మహేష్ బర్త్డే. ఈ సందర్భంగా సర్కారు వారి పాట నుంచి ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక మరికొన్ని గంటల్లో త్రివిక్రమ్-మహేష్ మూవీ నుంచి అప్డేట్ రాబోతోంది. సాయంత్రం 4.05గంటలకు ఓ సూపర్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు చిత్ర యూనిట్ తాజాగా ఓ వీడియో రూపంలో తెలిపింది.
ఆగస్ట్ 9, 1975లో సూపర్స్టార్ అయ్యేందుకు ఓ రాకుమారుడు పుట్టాడనే లైన్తో ప్రారంభమైన ఈ వీడియోలో.. మహేష్ నటించిన సినిమాల్లోని కొన్ని సీన్స్ను చూపించారు. అలాగే మహేష్ రియల్ లైప్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు, చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ ని చేయించడం వంటివి కూడా చూపించి ఆకట్టుకున్నారు. ఇక చివరిగా మహేష్-త్రివిక్రమ్ మూవీ నుంచి న్యూ అప్డేట్ రాబోతోందని తెలుపుతూ టైమ్ రివిల్ చేశారు. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
https://twitter.com/vamsi84/status/1424437944614494208?s=20