నాని మ‌న‌సు మార్చిన యంగ్ హీరో..ఖుషీలో ఫ్యాన్స్‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని మ‌న‌సు మార్చుకున్నాడు.. అది కూడా ఓ యంగ్ హీరోను చూసి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాని, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా న‌టించారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు.

Tuck Jagadish: Super Profits on the way!

కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ట‌క్ జ‌గ‌దీష్‌ను ఓటీటీకి ఇచ్చేశార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.42 కోట్ల‌కు ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇలాంటి త‌రుణంలోనే విడుద‌లైంది చిత్ర‌మే `SR కళ్యాణమండపం`. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు విడుదల చేయడానికి చాలా మంది నిర్మాతలు భయపడుతుంటే..యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం ఆడియన్స్ వస్తార‌నే న‌మ్మ‌కంతో థియేట‌ర్‌లోకి దిగాడు.

SR Kalyana Mandapam Movie Review - Half-Baked And Tiring

ఇక ఈయన అనుకున్న‌ట్టే SR కళ్యాణమండపం భారీ వ‌సూళ్లు రాబ‌ట్టి.. సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మిగిలిన నిర్మాతలు కూడా మందుడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే నాని కూడా మ‌న‌సు మార్చుకుని ఓటీటీ డీల్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. అంతేకాదు త్వ‌ర‌లోనే థియేట‌ర్‌లో దిగేందుకు డేట్ లాక్ చేసుకోబోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో..ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.