టాలీవుడ్ సూపర్ స్టార్ మహేస్ బాబు ఖాతాలో మరో అదిరిపోయే రికార్డ్ వచ్చి పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్, పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే నిన్న ఈ సినిమా నుంచి మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ మహేష్ అభిమానులనే కాదు.. అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన 15 గంటల్లోనే 80 వేల లైక్స్ మరియు లక్షకి పైగా కామెంట్స్ వచ్చేసాయి.
తక్కువ సమయంలో అత్యధిక లైక్స్, కామెంట్స్ సాధించి.. మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 13 న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ నిన్న అధికారికంగా ప్రకటించింది. అలాగే వచ్చే ఆగష్టు 9న మహేష్ బర్త్ డే. ఈ సందర్భంగా సర్కారు వారి పాట నుంచి మరో స్పెషల్ ట్రీట్ రాబోతోంది.