ఆది పురుష్ సెట్స్ లో ప్రభాస్.. ఏం చేశాడంటే…?

ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష సినిమా కూడా ఒకటి. ప్రభాస్ అలాగే ఓం రౌత్ కాంబోలో త్రీడీ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఆది పురుష రామాయణం నేపథ్యంలో ఏకకాలంలోనే హిందీ తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్,సైఫ్ అలీ ఖాన్,కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరకు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా నటిస్తోంది. గత నెలలో ముంబై లో ఆది పురుష్ రెస్యూమ్ షూట్ ని రావణ పాత్రధారి అయినా సైఫ్ అలీ ఖాన్ మీద మొదలుపెట్టి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు. అయితే దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ వేరే సినిమా పాట తో బిజీగా ఉండడం వల్ల, ఆది పురుష్ సెట్ లో లేకపోయినప్పటికీ సైఫ్ అలీ ఖాన్ పై కీలక సన్నివేశాలను పూర్తి ప్రభాస్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ ఆది పురుష్ సెట్ లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆదిపురుష్ షూటింగ్ కోసం ప్రభాస్ ముంబై రాబోతున్నట్టు గా సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.