ఇప్పటివరకు హైయెస్ట్ వ్యూస్ సాధించిన పాటలు ఇవే..

ఈ రోజుల్లో ఏదైనా ఒక పాట విడుదల అయితే , అది ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పడానికి కొన్ని కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా అందులో చెప్పుకోవలసినది యూట్యూబ్ . తాజాగా హీరోయిన్ సాయి పల్లవి సారంగదరియా అనే పాటకు దాదాపు 300 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే వీటితో పాటు మిగతా సాంగ్స్ ని కూడా ఒకసారి చూద్దాం.

1). మారి 2:
ఇందులో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా, ధనుష్ హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే.”రౌడీ బేబీ”అనే సాంగ్ 12 వందల మిలియన్ల వ్యూస్ ను సాధించింది.

2). అల వైకుంఠపురంలో:
అల్లు అర్జున్, పూజ హెగ్డే కలిసి నటించిన చిత్రం.. అల వైకుంఠపురం లో..”బుట్ట బొమ్మ”అనే సాంగ్ దాదాపుగా 600 మిలియన్ల వ్యూస్ ను సాధించింది.

3). అల వైకుంఠపురం లో:
ఇక ఈ సినిమాలోని”రాములో రాములో “అనే సాంగ్. 403 మిలియన్ల వ్యూస్ ను సాధించింది

4). ఫిదా:
సాయి పల్లవి, వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఫిదా. ఈ సినిమాలోని “వచ్చిందే”అనే సాంగ్ 309 మిలియన్ల వ్యూస్ ను సాధించింది.

5). లవ్ స్టోరీ:
సాయి పల్లవి, నాగచైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం లవ్ స్టోరి.. ఈ సినిమాలోని “సారంగదరియా”అనే పాట 300 మిలియన్ల వ్యూస్ ను సాధించింది.

6). రంగస్థలం:
సమంత,రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాలోని”రంగమ్మ మంగమ్మ”అనే పాట 290 మిలియన్లు వ్యూస్ ను సాధించింది.

అలాగే కొలవెరి డి అనే సాంగ్ ధనుష్ పాడడం చేత..287 మిలియన్ ల వ్యూస్ ను సాధించింది. ఇక సిటీ మార్ సాంగ్, సామజ వర గమన,మాస్టర్, పిల్లా రా సాంగ్ అనేటువంటి పాటలు 200 పైన మిలియను వ్యూస్ ను సాధించడం విశేషం.