దేశంలో త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు..491 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి అనుకున్న త‌రుణంలో.. అనూహ్యంగా క‌రోనా ఊపందుకుంది.

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా కేసులు గ‌త కొద్ది రోజులుగా మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 43,910 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,19,34,455 కు చేరుకుంది. అలాగే నిన్న 491 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,27,862 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 43,910 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,10,99,771 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,06,822 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.