చిరంజీవి డ్యాన్స్‌కు చిరాకు పడ్డ డైరెక్టర్..?

అవును.. మీరు చదివింది నిజమే. చిరంజీవి డ్యాన్స్ ఓ డైరెక్టర్‌కు చిరాకుతో పాటు కోపం కూడా తెప్పించిందట. అయితే ఇది ఇప్పటిమాట కాదులెండీ. చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లు అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రాణం ఖరీదు చిత్రం ముందు రిలీజ్ అయ్యి అది ఆయనకు తొలి చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు చంద్ర మోహన్, జయసుధ, రావుగోపాల్ రావు లాంటి వారు నటించారు. అయితే ఈ సినిమా దర్శకుడు కె.వాసు ఓ సందర్భంలో చిరంజీవి డ్యాన్స్ వల్ల చిరాకు పడిన సంఘటన చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సినిమా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో చిత్ర యూనిట్ అక్కడి అప్సర లాడ్జీలో స్టే చేశారు.

అయితే దర్శకుడు కె.వాసు సెకండ్ ఫ్లోర్‌లో ఉండగా, మిగతా చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నారట. అయితే రోజూ రాత్రి కాగానే పెద్ద సౌండ్‌తో పాటలు వినిపించి ఆ దర్శకుడికి చిరాకు తెప్పించాయట. ఇలా రెండు రోజులు కంటిన్యూగా జరగడంతో మూడోరోజు అలా ఎవరు చేస్తున్నారో కనుక్కోమని దర్శకుడు అసిస్టెంట్ డైరెక్టర్‌ను కోరాడట. అయితే చిరంజీవి తన రూమ్‌లో పాటలు పెద్ద సౌండ్‌తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడని ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడంతో, సౌండ్ తగ్గించుకుని ప్రాక్టీస్ చేసుకోమని చెప్పారట వాసు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ ఆయన డైరెక్టర్‌కు ఏ రేంజ్‌లో చిరాకు తెప్పించి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.