భార‌త్‌లో క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా..కొత్త‌గా 42,909 పాజిటివ్ కేసులు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

అయితే గ‌త ఆరు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతుండ‌డంతో.. ప్ర‌జ‌ల్లో తీవ్ర క‌ల‌వ‌రం మొద‌లైంది. గ‌త 24 గంటల్లో భారత్‌లో 42,909 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,27,37,939 కు చేరుకుంది. అలాగే నిన్న 380 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,38,210 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 34,763 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,19,23,405 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 3,76,324 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న దేశ‌వ్యాప్తంగా 14,19,990 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.