కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది.
అయితే గత కొద్ది రోజులుగా వెయ్యికి పైగా నమోదు అవుతున్న రోజూవారీ కేసులు నిన్న మాత్రం 8 వందలకే పడిపోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 878 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో చిత్తూరు జిల్లాలో 255 కేసులు, అతి స్వల్పంగా అనంతపురం జిల్లాలో 2 కేసులు చప్పున నమోదు అయ్యాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 20,13,001 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 13,838 దగ్గర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 1,182 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,84,301 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 14,862 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 41,173 కరోనా టెస్ట్లు నిర్వహించారు. అయితే టెస్ట్లు తక్కువగా చేయడం వల్లే రోజూవారీ కేసులు తక్కువగా వచ్చాయి.