ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ వివాహేతర సంబంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరియు ఎందరో ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవడటమే కాదు.. తన సుఖానికి, ఆనందడానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చాడు ఓ నీచపు తండ్రి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాజధాని పాట్నా పరిధిలో కొద్రా ప్రాంతానికి చెందిన మిథిలేష్ రవిదాస్ కుమారుడు సచిన్ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన కొన్ని నెలలకే తండ్రి దగ్గర భార్యను ఉంచి ఉద్యోగం రిత్యా గుజరాత్కు వెళ్లాడు. ఇదే అదునుగా చూసుకున్న మిథిలేష్ కోడలిపై కన్నేసి.. ఆమెను లోబరుచుకున్నాడు. ఇక సచిన్ కూడా ఇంట్లో లేకపోవడంతో.. మామ, కోడలి రాసలీలలు క్రమంగా సాగాయి.
అయితే స్థానికుల ద్వారా అసలు నిజం తెలుసుకున్న సచిన్.. వెంటనే గుజరాత్ నుంచి వచ్చి తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే మిథిలేష్ కొడుకు అని కూడా చూడకుండా కత్తితో గొంతు కోసి.. సచిన్ శవాన్ని ఎవరికీ అనుమానం రాకుండా దూరంగా పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్టు కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా మిథిలేష్ బండారమంత బయట పడింది. దాంతో మిథిలేష్ణు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.