ఆస్ప‌త్రిలో చేరిన అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్.. ఎందుకంటే..?

రాజేంద్ర సదాశివ్ నికల్జీ అలియాస్ చోటా రాజన్ ప్రజెంట్ జైలులో ఉన్న సంగతి అందరికీ విదితమే. ముంబైలో జరిగిన క్రైమ్స్ కొన్నిటికి సూత్రధారి చోటా రాజన్ కాగా, అతడిని పోలీసులు అరెస్టు చేసి ఆధారాలతో కోర్టుకు అప్పజెప్పగా జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు కటకటాల్లో ఉన్నాడు. ఇక గ్యాంగ్ స్టర్‌గా చోటా రాజన్ ముంబై అండర్ వరల్డ్‌ను సినిమాల్లో మాదరిగానే ఏలాడని చెప్పొచ్చు. జైలులో ఉంటున్న చోటా రాజాన్ తాజాగా అస్వస్థతకు గురయ్యాడు.

చికిత్స నిమిత్తం అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌స్టర్ డాక్టర్స్ పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. తాను అనుభవించిన శిక్ష కంటే ఎక్కువ కాలం శిక్ష అనుభవించానని, ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చోటా రాజన్ ముంబై హైకోర్టులో అప్పల్ చేశారు. ఈ మేరకు చోటా రాజన్ తరఫున న్యాయవాదులు ఆధారాలు సమర్పించబోతున్నారు. తన నేరాల విషయమై దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు చూపించలేదని న్యాయవాదులు వాదిస్తున్నారు. గతంలో విధించిన శిక్షను హై కోర్టులో సవాలు చేస్తుండగా, ఉన్నత న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తుందో చూడాలి మరి.