ధునుష్ కోసం బ‌రిలోకి దిగుతున్న ముగ్గురు హీరోయిన్లు?!

కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న క‌మిటైన ద‌ర్శ‌కుల్లో మిత్ర‌న్ జ‌వ‌హార్ ఒక‌రు. ధనుష్ 44వ చిత్రంలో ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కుతోంద‌.

అయితే ఈ చిత్రంలో ధునుష్ కోసం ముగ్గురు హీరోయిన్లు బ‌రిలోకి దిగుతున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. ఈ చిత్రంలో హ‌న్సిక‌, ప్రియా భ‌వాని శంక‌ర్‌, నిత్యా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్నారట‌.

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయిన‌ట్టు టాక్‌. కాగా, త్వ‌ర‌లో తెలుగులో ధునుష్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై అధిక‌రిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటుగా త‌మిళ‌, హిందీ భాష‌ల్లో కూడా రూపుదిద్దుకోనుంది.