శ్రీను వైట్ల జోరు..ముచ్చ‌ట‌గా మూడిటిని లైన్‌లో పెట్టిన డైరెక్ట‌ర్‌!

ఒకానొక స‌మ‌యంలో వ‌రుస విజయాల‌తో స్టార్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోయిన శ్రీ‌ను వైట్ల‌.. ఈ మ‌ధ్య కాలంలో హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల.. వరుణ్ తేజ్ తో మిస్ట‌ర్ త‌ర్వాత మ‌రో చిత్రం చేయ‌లేదు.

అయితే కొంత గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు మ‌ళ్లీ వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెడుతున్నాడు. ప్ర‌స్తుతం మంచు విష్ణుతో ఢీకి సీక్వెల్‌గా డి అండ్ డి సినిమా చేస్తున్న ఈయ‌న‌.. లాక్ డౌన్ సమయంలో మరో రెండు స్క్రిప్టులను కూడా రెడీ చేసుకున్నార‌ట‌.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌ను వైట్ల‌.. ఈ విష‌యాన్ని తెలిపారు. నాకు గ్యాప్ వచ్చిందని అనుకుంటున్నారు .. కానీ అందులో నిజం లేదు. కరోనా కారణంగానే వెంటనే నేను సెట్స్ పైకి వెళ్లలేకపోయాను. ఇక నా నుంచి త్వ‌ర‌లో రాబోతున్న మూడు సినిమాలు ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్లే అని శ్రీ‌ను వైట్ల చెప్పుకొచ్చాడు. ముచ్చ‌ట‌గా మూడు చిత్రాల‌ను లైన్‌లో పెట్టిన ఈ డైరెక్ట‌ర్ మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో..లేదో..చూడాలి.