పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన `అఖిల్‌` భామ‌!

`అఖిల్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ప‌రిచ‌యం అయిన స‌యేషా సైగ‌ల్‌.. త‌మిళ న‌టుడు ఆర్య‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2019లో వీరి వివాహం అంగ‌రంగ‌వైభవంగా జ‌రిగింది. అయితే తాజాగా స‌యేషా సండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది.

ఈ విషయాన్ని ఆర్య బెస్ట్ ఫ్రెండ్‌, ప్ర‌ముఖ హీరో విశాల్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. త‌ను మావ‌య్య అయ్యాన‌ని, చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంద‌ని చెబుతూ విశాల్ ఆర్య‌, స‌యేషాల‌కు అభినంద‌న‌లు తెలిపారు. అలాగే త‌న స్నేహితుడు ఆర్య తండ్రిగా కొత్త బాధ్య‌త‌లు తీసుకున్నాడ‌ని విశాల్ ట్వీట్ చేశాడు.

దాంతో ప‌లువ‌రు సినీ సెల‌బ్రెటీలు మ‌రియు స‌న్నిహితులు.. ఆర్య‌, స‌యేషా దంప‌తుల‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. కాగా, ఆర్య‌..విశాల్ కలిసి `ఎనిమీ` అనే చిత్రంలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.