టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. మళ్లీ తాజాగా మొదలైంది. ఇప్పటికే దుబాయ్లో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్ను హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. మహేష్ బాబు తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం లోకేషన్ స్టిల్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇందులో మహేష్కు డైరెక్టర్ పరుశురామ్ షాట్ వివరిస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి పెద్దగా గ్యాప్ లేకుండామూడు నెలల పాటు చిత్రీకరణను జరిపి.. షూటింగు పార్టును పూర్తిచేయనున్నారట. అనంతరం మహేష్ త్రివిక్రమ్ సినిమాను ప్రారంభించనున్నాడని తెలుస్తోంది.