పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు. ఈ మల్టీస్టారర్ ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడంతో.. అన్ని చిత్రాలు సెట్స్ మీదకు వెళ్తున్నాయి. కానీ, పవన్-రానాల చిత్రం మాత్రం రీస్టార్ట్ కాలేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేశారు.
అయితే ఆ టైమ్ రానే వచ్చింది. ఎట్టకేలకు పవన్ రంగంలోకి దిగాడు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. పవన్ సెట్స్లోకి నడిచొస్తున్న ఫొటోను ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ షేర్ చేసింది. దాంతో పవన్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. ఇక రానా కూడా త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో భాగం కానున్నాడని తెలుస్తోంది.