నెటిజన్‏లపై నిధి అగర్వాల్ ఫైర్..?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. తన అందచందాలతో యూత్ ని కట్టిపడేసిన ఈ చిన్నది ఇండస్ట్రీలో వరుస ఆఫర్ లను అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ కే గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటో లను, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉండే ఈ భామ ఒక విషయం మీద నెటిజన్ లపై ఫైర్ అయ్యింది.తన ఫోటోలను మితిమీరి వాడుకుంటున్నారంటూ సీరియస్ అయ్యింది.

 

తాజాగా తన ఇన్‏స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది నిధి. నాకు సంబంధించిన ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యూలేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైన సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే వాటిని షేర్ చేయకండి. ఈ పనులతో మీరు మరింత దిగజారకండి అంటూ నిధి తన కోపాన్ని వ్యక్తం చేసింది.