జనాల ప్రాణాలను హరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా ఇంకా పోలేదు..అందరూ మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని విభిన్న పద్దతిలో చెప్తున్నారు. ఇవన్నీ నార్మల్ గా చెప్తే జనం వినరని అందుకోసం ట్రెండ్ ఫాలో అవుతూ హీరో హీరోయిన్ ల డైలాగ్ లు వాడుతున్నారు. కరోనాపై అవగాహన కల్పించడం కోసం తాజాగా ‘నారప్ప’సినిమా డైలాగ్ని వాడేసుకున్నారు పోలీసులు.
నారప్ప సినిమా పోస్టర్లోని వెంకటేష్ ముఖానికి మాస్క్ పెట్టి..ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు’ అంటూ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముందు ఇలా పోస్ట్ చేశారో లేదో ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా తెగ షేర్ చేసుకుంటున్నారు. విషయం ఏదైనా వెరైటీ గా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ కొందరు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇప్పటికైనా మన నారప్ప చెప్పినట్టు విని మాస్కులు పెట్టుకుంటారా చూడాలి.