టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం మహేశ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశుమరామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో మహేశ్కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్లోనూ ఈ మూవీ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని సమాచారం.
కాగా, ఈ సినిమా ఆడియో రైట్స్ సరిగమ సౌత్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ.నాలుగున్నర కోట్లకు మూవీ ఆడియో రైట్స్ అమ్ముడు పోయాయని నయా టాక్. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు మహేశ్ చేయని పాత్రను ఈ సినిమాలో చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. కాగా, మహేశ్ న్యూ లుక్స్ నెట్టింట వైరలయిన సంగతి తెలిసిందే. మొత్తంగా డైరెక్టర్ పరశురామ్ ‘సర్కారు వారి పాట’లో న్యూ మహేశ్ను చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన మహేశ్ సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా టైటిల్ వెరీ డిఫరెంట్గా ఉందని ఆడియన్స్ అంటున్నారు.