ఎన్టీఆర్ టీవీ షోపై న్యూ అప్డేట్‌..?!

ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోను ప్ర‌ముఖ టీవీ చానెల్‌ జెమిని స్టార్ట్ చేయ‌బోతోంది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది.

ఈ సారి ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. ఇటీవ‌ల ఈ షోకు సంబంధించి ప్రోమోలు కూడా విడుద‌ల అయ్యాయి. ఇక ఈ షో ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, క‌రోనా అడ్డు ప‌డింది. దాంతో ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని బుల్లితెర ప్రియులు మ‌రియు ఎన్టీఆర్ అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఎట్ట‌కేల‌కు ఈ షోపై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ షో షూటింగ్ జూలై రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. తారక్ మళ్ళీ సూట్ వేసుకొని ఈ షో షూట్ లో పాల్గోనున్నాడ‌ట‌. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం స్పెషల్ సెట్ ఏర్పాటు చేశారు. ముందు కొన్ని ఎపిసోడ్స్ ను పూర్తి చేసి.. ఆ త‌ర్వాత ప్రసారం చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.