హీరో సూర్యకు బీజేపీ నేతలు వార్నింగ్..?

గత కొన్ని రోజులుగా కేంద్రానికి సెలబ్రిటీలకు మధ్య వార్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల సినీ పరిశ్రమకు దెబ్బ తగిలే ప్రమాద ముందని పలువురు సినీ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆ ఘటనపై హీరో సూర్య కూడా స్పందించడంతో ఆయనకు వార్నింగ్ వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే..కేంద్ర సర్కార్ సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీద సెలబ్రిటీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నిరసనను తెలియజేస్తున్నారు.

ఆ చట్టం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని హీరో సూర్య తన దైన శైలిలో స్పందించాడు. చట్టాలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని, కీడు చేసేవిగా ఉండకూడదంటూ హీరో సూర్య తెగేసి చెప్పాడు. దీంతో సూర్య మాటకు బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. తమిళనాడు బిజేపి నాయకుడు సూర్యను హెచ్చరించారు. ఇటువంటి విషయాలలో అనవసరంగా కలగజేసుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కలకలం రేపుతోంది.