డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు కోర్టు ఊరిట‌..ఫుల్ ఖుషీలో చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌!

ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన శంక‌ర్‌.. ఇటీవ‌ల మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్ర‌క‌టించ‌గానే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంక‌ర్‌పై కోర్టులో కేసు వేసింది. ఇండియా 2 ను పక్కన పెట్టి శంకర్‌‌ చరణ్‌ మూవీ ప్లాన్ చేయ‌డంతో లైకా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం గ‌త కొద్ది రోజులుగా న‌డుస్తూనే ఉంది.

అయితే తాజాగా ఈ న్యాయవివాదం ఓ కొలిక్కి వచ్చింది. శంకర్‌పై నిషేధం విధించాలన్న లైకా ప్రొడక్షన్స్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ శుక్రవారం కోర్టు శంక‌ర్‌కు భారీ ఊర‌ట‌నిచ్చింది. ఇక‌ కోర్టు తీర్పుతో శంకర్‌ కొత్త సినిమాల‌కు లైన్‌ క్లియరైంది. అందుకే రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.