టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్తో చేయబోతున్నాడన్న విషయంలో పెద్ద గందగోళం నెలకొంది. పుష్ప తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయనున్నాడని ఓవైపు ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు ఏఆర్ మురగదాస్, బోయపాటి శ్రీను, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటి అగ్ర దర్శకులను బన్నీ లైన్ లో పెట్టాడని వార్తలు వస్తున్నాయి.
అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. పుష్ప తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకే బన్నీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే బోయపాటి ఒక కథ వినిపించడం.. అది బన్నీ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. అలాగే పుష్ప పూర్తి అయిత తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై ప్రకటన కూడా వస్తుందని టాక్ నడుస్తోంది.