పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూజా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్కు ఎదిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
అయితే వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పూజా.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లే అన్నట్టు వ్యవహరిస్తోందట. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని కరాఖండిగా చెప్పేస్తోందట.
ఇటీవల ఓ పెద్ద తెలుగు నిర్మాణ సంస్థ కూడా పూజాహెగ్డేను రెమ్యునరేషన్ కొంత తగ్గించుకోవాలని రిక్వెస్ట్ చేసినప్పటికీ.. ఆమె ఏ మాత్రం తగ్గనని ససేమిరా చెప్పేస్తుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో మూవీకి మూడు కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్. కాగా, తెలుగులో ఈ అమ్మడు రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య చిత్రాలు చేస్తోంది.