శేఖర్ కు ధనుష్ అభినందనలు..?

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ప్యాన్ ఇండియా మూవీల జోరు న‌డుస్తోంది. ఇదే బాట‌లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా విభిన్న కథలతో రావ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయ‌న క్లాస్ డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కిస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కాగా ఈ మూవీకి ఇద్దరు జాతీయ అవార్డులు తీసుకున్న న‌టులు వర్క్ చేస్తుండడం విశేషం.

ఇక నిన్న దివంగత సునీత జయంతి సందర్భంగా ఈ మూవీ లాంచ్‌ను ప్రకటించారు. ఈ మూవీని తెలుగు, తమిళ్, హిందీలో తెర‌కెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాకు చేయ‌డం ప‌ట్ల తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్న‌ట్టు హీరో ధనుష్ తన ట్విట్టర్ ద్వారా ప్ర‌క‌టించార‌. దీంతో ఈ ట్వీట్‌కాస్తా విప‌రీంగా వైర‌ల్ అవుతోంది. తాను డైరెక్ట‌ర్ శేఖర్ కమ్ములతో పాటు నారాయణ దాస్ అలాగే కె. నారంగ్-పుస్కర్ రామ్మోహన్ లతో చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.