డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా సలార్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాను రెండు భాగాలుగా తీస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కథ విడిది ఎక్కువగా ఉండటంతో పార్ట్-1, పార్ట్-2గా సలార్ను తీసు ఛాన్స్ ఉంది. ఇలా తీస్తేనే బాగుంటుందనే ఆలోచనలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం తీస్తున్న ప్యాన్ ఇండియన్ సినిమాలు అన్నీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే కథలో మార్పులు చేసే ఆలోచనల సలార్ టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గత జనవరిలో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. గోదావరిఖని బొగ్గు గనుల్లో ఇప్పటికే ప్రభాస్పై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. అయితే తర్వాత కరోనా ప్రభావంతో మూవీ షూటింగ్ వాయిదాపడింది. కాగా ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్ను ప్రారంభించే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.