ఇండస్ట్రీలో కొత్త సినిమాల హవా బాగానే నడుస్తోంది. తాజాగా అభినవ్ సర్ధార్ పటేల్ తోపాటు రామ్ కార్తిక్, చాందిని తమిళరసన్ అలాగే శాని సాల్మాన్ తో పాటుగా శెర్రి అగర్వాల్ కీలక పాత్రలతో నటించినసైన్స్ ఫిక్షన్ మూవీ పీనట్ డైమండ్. ఈ మూవీకి త్రిపర్ణ వెంకటేష్ డైరెక్షన్ వహించారు. అయితే రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ క్రిష్ విడుదల చేశారు.
అయితే ఈ మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది. త్రేతాయుగంలో మంచి చెడు అనేవి అంటూ మొదలైన డైలాగు బాగానే ఆకట్టుకుంది. కాగా ఇప్పుడున్న కలియుగంలో కేవలం మంచికి చోటు లేదని చెడుకి బలంగా పేరుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే 30 ఏళ్ల గ్యాప్ లో రెండు వేర్వేరు కాలాలకు చెందిన మనుషుల కథలను సేమ్ వేరియేషన్స్తో చూపించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మొత్తానికి నటీనటులు బాగానే యాక్ట్ చేశారు. వజ్రాలపై పరిశోధన చేస్తుండటంపై సినిమా సాగనుంది.