రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరోలు సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓం రౌత్ మాట్లాడుతూ..ప్రభాస్ పెద్ద స్టార్.ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఆయనకి అభిమానులు ఉన్నారు.
యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ప్రభాస్ సెట్లో అందరినీ సమానంగా చూస్తూ పలకరిస్తారు. ప్రేమతో కూడిన పలకరింపుతో ఆయన తన చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తారు. తన ఇంటివంటను సెట్లోని వారితో ఆయన షేర్ చేసుకుంటారు. మిగతా స్టార్స్ తో పోలిస్తే ప్రభాస్ చాలా సింపుల్. ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టార్ ను చూడలేదు` చెప్పుకొచ్చాడు. దాంతో ఓం రౌత్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.