అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నాంది. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ జీవిత నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన హిందీ ,తమిళ ,కన్నడ, మలయాళ రీమేక్ రైట్స్ ను కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
ఇక ఈ రీమేక్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ నటించబోతున్నాడు. దీనిపై నేడు అధికారిక ప్రకటన రావడం జరిగింది. అజయ్ దేవ్ గణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ మూవీ నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.