సాగ‌ర్‌లో విజ‌యం దిశ‌గా టీఆర్ ఎస్‌..!

న‌ల్గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజ‌యం ఖాయ‌మైన‌ట్లుగా తెలుస్తున్న‌ది. వ‌రుస‌గా తొలి ఎనిమిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఏడో రౌండ్ ముగిసే స‌రికి 6,592 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ ముగిసే స‌రికి మొత్తంగా 9583ఓట్ల ఆధిక్య‌త‌ను సాధించింది.

ఇక తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు, రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు, మూడో రౌండ్‌లో టీఆర్ఎస్కు 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు, నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు, ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు, ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు, ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు. ఎనిమిదో రౌండ్‌ను అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబు‌ళ్లపై లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండ‌డంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి‌కా‌నుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధి‌కా‌రి‌కంగా విజే‌తను ప్రక‌టించే అవ‌కాశం ఉండ‌గా టీఆర్ ఎస్ దాదాపు 25వేల పైచిలుకు మెజార్టీని సాధించే అవ‌కాశ‌ముంది.