వరుణ్తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమాలో హర్షవర్ధన్ ఓ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు తకిట తకిట, నా ఇష్టం, కవచం వంటి పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్లోనూ సనమ్ తేరీ కసమ్ వంటి అడపాదడపా చిత్రాల్లో నటించాడు. ఇటీవలే ఓటీటీ ప్లాట్ఫామ్ జీ 5లో రిలీజైన తైష్ సినిమాలోనూ కనిపించాడు. తాజాగా ఆయనను పలువురు ప్రసంశిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి సాయం చేయాలని హర్షవర్ధన్ తన బైక్ ను అమ్మాలనుకుంటున్నాడు.
హర్షవర్ధన్ రాణే తన బైక్ని అమ్మి మరీ కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందిస్తానంటున్నాడు. తన ఇన్స్టాగ్రామ్లో ఎంతో ప్రేమగా చూసుకుంటున్న బైక్ ఫొటోలు షేర్ చేస్తూ అమ్మకానికి పెట్టాడు. ఆ బైక్ ను తీసుకొని ఆక్సిజన్ ఇవ్వండని ఈ నటుడు కోరాడు. హర్షవర్ధన్ రాణే ఆలోచనకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో మీరు చూపిస్తున్న చొరవ అద్భుతం అని కామెంట్స్ పెడుతున్నారు. ఎంతో ప్రేమగా చూసుకునే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను తనే స్వయంగా శుభ్రం చేస్తున్న ఫొటోలతో పాటు దానిపై చక్కర్లు కొట్టిన ఫొటోలను సైతం షేర్ చేశాడు. ఈ నటుడు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.