ఇండ‌స్ట్రీలో మ‌రో విషాయం..క‌రోనాతో ప్ర‌ముఖ న‌టుడు మృతి!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్‌.. సామాన్యుల‌నే కాదు సెల‌బ్రెటీల‌ను సైతం ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో విషాదాల‌ను నింపున క‌రోనా.. తాజాగా మ‌రొక‌రిని బ‌లితీసుకుంది. ప్రముఖ త‌మిళ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్‌ సుభా శనివారం కరోనాతో మృతి చెందారు.

ఇటీవల క‌రోనా బారిన ప‌డిన ఈయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉద‌యం తుది శ్వాస విడిచారు. దాంతో కోలీవుడ్ వ‌ర్గాల్లో తీవ్ర విష‌యం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే వెంక‌ట్ సుభా మృతిపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.