ఎన్టీఆర్ జ‌యంతి..మ‌రోసారి త‌న గాత్రంతో బాల‌య్య విశ్వ‌రూపం!

తెలుగు తెరపై తిరుగులేని చెరిగిపోని ముద్ర వేసుకున్నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇచ్చారు.

సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తనలోని గాయకున్ని బయట పెట్టే బాలయ్య.. తండ్రి జ‌యంత సంద‌ర్భంగా మ‌రోసారి త‌న గాత్రానికి ప‌ని చెప్పారు. బాల‌య్య స్వ‌యంగా పవిత్ర శ్లోకమైన శ్రీరామదండంకం ని ఆలపించారు. పాట రూపంలో ఆ శ్లోకాన్ని పాడి.. ఈ రోజు ఉద‌యం 9.45నిమిషాలకు విడుదల చేశారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. కాగా, గతేడాది జగదేకవీరునికథ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరి పాటను పాడి సర్ప్రైజ్ చేసిన బాల‌య్య‌.. ఇప్పుడు శ్రీరామదండకంతో మ‌రోసారి విశ్వ‌రూపం చూపించారు.