టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ వరుస విషాదాలు నింపుతుంది. ఇప్పటికే ఎంతరో సినీ ప్రముఖులు కరోనా కాటుకు బలికాగా.. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడి జయరామ్ చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు.
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్బాబు వంటి వారితో తెలుగులోను, మమ్ముట్టి, మోహన్లాల్, సురేశ్ గోపి లాంటి హీరోలతో మలయాళంలోనూ మరియు ఇతర భాషల్లో కూడా పలు అద్భుత చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక జయరాం మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.