టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు..సాయిపల్లవి. ఈమె ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించినట్లు టాలీవుడ్ టాక్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్ను వదులుకుంది. ఆ తర్వాత మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్గా అనుకున్నారు కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసింది. అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాదన్(రీమేక్) వంటి సినిమాలను సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. ఇవన్నీ భారీ సినిమాలు కాబట్టి ఆమెకు కోటి పైనే పారితోషికం ఇస్తాము అని నిర్మాతలు ఆఫర్ ఇచ్చారని, కానీ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అని భావించి ఆమె రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్ యాడ్స్ని కూడా ఒప్పుకోలేదు. వాటి విలువ దాదాపు రూ.5 కోట్ల పైనే ఉంటుందని ఆమె సన్నిహితులు తెలిపారు.