రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా.. కన్నడ, హిందీ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
ఇక ఇటీవలె కార్తి హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. తమిళులకు, తమిళ సంప్రదాయాలకు ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలని కోరుకుంటోందట.
ఈ విషయాన్ని స్వయంగా రష్మికనే తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా విభిన్నంగా ఉంది. ఇది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా ఇక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక అంటూ సీక్రెట్స్ రివిల్ చేసింది రష్మిక.