దగ్గుబాటి వారి అబ్బాయి రానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విభిన్న కథలు, విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్న రానా.. బాహుబలి, ఘాజీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం విరాటపర్వం, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్న రానా.. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్సిగ్నెల్ ఇచ్చాడు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు.
ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమాల తర్వాత ఈ పాన్ ఇండియా చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇప్పటికే కథ సిద్ధమైందని. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయని అంటున్నారు. ఇక త్వరలో దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు బయటకు రానున్నాయి.