టాలీవుడ్‌లో మ‌రో విషాదం..క‌రోనాతో యువ ద‌ర్శ‌కుడు మృతి!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి బారిన సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు పడుతున్న విషయం తెలిసిందే. కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో క‌రోనా మ‌రో విషాదాన్ని నింపింది.

శ్రీవిష్ణుతో మా అబ్బాయి సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇటీవ‌లె కుమార్‌కు క‌రోనా సోక‌గా.. హాస్పిట‌ల్‌లో చేరి.. చికిత్స తీసుకుంటున్నారు. కానీ, ప‌రిస్థితి విష‌మించ‌డంతో తాజాగా కుమార్ తుది శ్వాస విడిచారు.

కుమార్ మ‌ర‌ణంతో టాలీవుడ్ షాక్‌కు గురైంది. కాగా, కుమార్ వట్టి స్వస్థలం శ్రీకాకులం జిల్లా నర్సన్న పేట. చాలా ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన కుమార్.. దర్శకుడు పరశురామ్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నారు. ఇక మా అబ్బాయి సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు.