రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో సలార్ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్ పాత్రని అంటున్నారు. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని.. ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.