జాన్వీ కొత్త ట్యాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు!

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ సినిమాలో జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది.

ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహార్ దర్శకత్వంతో తఖ్త్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2, నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఘోస్ట్ స్టోరీస్ ఇలా వరుస ప్రాజెక్ట్‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న జాన్వీ.. తాజాగా త‌న‌లో ఉన్న కొత్త ట్యాలెంట్‌ను బ‌య‌ట‌పెట్టింది.

Janhvi Kapoor Asks If She Can Call Herself A "Painter." The Internet's  Verdict

తాను క‌ళాకారిణే కాదు చిత్ర‌కారిణి కూడా అని నిరూపించుకుంది జాన్వి. పెయింటింగ్ వేస్తున్న‌ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంటూ ఇప్ప‌టికైనా న‌న్ను నేను పెయింట‌ర్‌గా పిలుచుకోవ‌చ్చా? అని అడుగుతోంది ఈ బాలీవుడ్ భామ. దీంతో జాన్వీ వేసిన బొమ్మ‌ల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ.. లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CPfhZ0xF7be/?utm_source=ig_web_copy_link