టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. సిల్వర్ స్క్రీన్పై మరింత బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. చిరంజీవి సరసన ఆచార్య, కమల్ సరసన ఇండియన్ 2, నాగార్జున సరసన ఓ చిత్రం చేస్తున్న కాజల్.. ఇప్పుడు కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
పేపర్బాయ్ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చూసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. థ్రిల్లింగ్ కథతో లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కబోతోందట.
ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించబోతోందని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ కెరీర్లోనే విభిన్నమైన ప్రయత్నంగా ఈ సినిమా ఉంటుందని.. కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గిన తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.