రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ప్రభాస్కు జోడీగా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక ఓ కీలక పాత్ర పోషించబోతోందట.
ఈ చిత్రంలో ప్రభాస్ సోదరి పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని.. ఆ పాత్రలో జ్యోతికను ఎంపిక చేశారని లేటెస్ట్ టాక్. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. జ్యోతిన ఈ బంపర్ ఛాన్స్కు ఓకే చెప్పిదని ప్రచారం జరుగుతోంది.