కరోనా టైంలో పేదవారికి సేవ చేయడానికి సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి విరాళాలను అందజేస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళ నటులు సూర్య, కార్తీ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. తమిళ దర్శకుడు మురుగ దాస్ కూడా రూ.25 లక్షలు అందించారు. తాజాగా నేడు అజిత్ పాతిక లక్షల రూపాయలు సీఎం సహాయనిధికి ఆన్లైన్ ద్వారా పంపారు. గత ఏడాది కూడా అజిత్ విరాళం అందించారు.
అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేలో విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన ఫస్ట్ లుక్ వాయిదా వేశారు. ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. తెలుగు యంగ్ హీరో కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.