నేను తాగింది మందు కాదు.. నీళ్లు : ప్రముఖ హీరోయిన్‌

ప్రముఖ నటి ధన్య బాలకృష్ణ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో తన ఫ్యాన్స్ తో చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన ముద్దు పేరు పప్పు అని చెప్పింది. ప్రస్తుతం తాను బెంగళూరులో ఉంటున్నట్లు వెల్లడించింది. ‘రాజారాణి’ సినిమాలో తనను మద్యం తాగినట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది.

తాను ఎక్కువగా పార్టీలకు వెళ్లే వ్యక్తిని కానని, వీకెండ్‌ లో మాత్రం ఫ్రెండ్స్ తో కలిసి భోజనానికి వెళ్తానని చెప్పింది. పవన్‌ కల్యాణ్‌, సూర్య, రణ్‌బీర్‌ కపూర్‌ తన క్రష్‌ లని, వారితో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ధన్య బాలకృష్ణ తెలుగులో కన్నా తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. తెలుగులో నేను శైలజ’, ‘రాజు గారి గది’, ‘రాజారాణి’ వంటి సినిమాలతో ఆమె పాపులర్ అయ్యింది. ధన్య బాలకృష్ణ విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు మల్టీస్టారర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కూడా నటించింది.