మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్మెలిందాగేట్స్ ఫాండేషన్ ఛైర్మన్ బిల్గేట్స్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తన భార్య మిలిందా గేట్స్కు విడాకులు ఇస్తున్నట్లు..వైవాహిక జీవితానికి గుడ్బై చెప్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇదే విషయాన్ని మిలిందా గేట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మేము విడిపోయినప్పటికీ బిల్మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ కొనసాగుతుంది. ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తామని తెలిపారు.
కానీ భార్యాభర్తలుగా మేము కొనసాగలేమని భావించాం. అందుకే తాము కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని, తమ నిర్ణయాన్ని, వ్యక్తిగత ఆకాంక్షలను గౌరవిస్తారని ఆశిస్తున్నామని గేట్స్, మెలిందాలు పేర్కొన్నారు. కాగా, ఈ బిల్గేట్స్ దంపతుల నుంచి వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఖచ్చితంగా దీని ప్రభావం వ్యాపార వ్యవస్థలపై పడుతుందని భావిస్తున్నారు.