ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో పరమ పవిత్రంగా జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసం ముగింపు రోజుగా ఈ పండగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ముస్లింలంతా ఈద్ ను జరుపుకుంటున్నారు. అయితే కరోనా కారణంగా.. ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈద్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ స్పెషల్ వీడియో ద్వారా ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. `ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవా నిరతి కి మారు పేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం.
అల్లా కృపా కటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకంక్షలు తెలియచేసుకుంటున్నాను` అని బాలయ్య ఈ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
https://twitter.com/baraju_SuperHit/status/1393072737229307905?s=20