టాలీవుడ్ సూపర్ హిట్ జోడీల్లో నాగార్జున, అనుష్క శెట్టి జోడి ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు చాల సినిమాలే వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. నాగ్-అనుష్క జోడి అంటే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారట. ఇటీవలె వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్ డిటెక్టివ్గా కనబడనున్నాడట.
ఇక ఇప్పటికే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం అనుష్కను ఎంపిక చేశాడట దర్శకుడు. ఇందులో భాగంగానే అనుష్కను స్పంప్రదించగా.. ఆమె ఓకే చెప్పనట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో చూడాలి.