ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా ఎమ్మెల్యే రోజా..!?

చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్‌ మలర్‌ హాస్పిట నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సలహా ప్రకారం ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. డిశ్చార్జి సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్, కుటుంబ సభ్యులతో కలిసి రోజా పిక్స్ దిగారు. కొద్దిరోజుల క్రితమే మలర్ ఆస్పత్రిలో రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి.

ఒక వారం రోజులకు పైగా రోజా మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె మెల్లిగా కోలుకుంటున్నారని భర్త ఆర్కే సెల్వమణి తెలిపారు. మొన్న ఆ మధ్య ఏవో సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లగా, వెంటనే సర్జరీ అవసరమని వైద్యులు చెప్పారు. కానీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పూర్తయ్యేంతవరకూ రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరారు కానీ వాయిదా వెయ్యటం మంచి నిర్ణయం కాదని వైద్యులు వారించినట్లు సెల్వమణి తెలిపారు. దీంతో రోజా వెంటనే ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు.